TTD On Tirumala Fuel Shortage: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత వెంటాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తిరుమల వెళ్లే భక్తులకు కూడా పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పలేదు. ఆదివారం ఉదయం తిరుమలలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయతే టీటీడీ ఇంధన కొరతపై ఒక కీలక ప్రకటనను జారీ చేసింది. తిరుమలలో ఇంధనం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. భక్తులకు ఆందోళన అవసరం లేదని చెప్పింది.