Tirumala Srivari Devotees Clash: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కూర్చునే విషయంలో గొడవ తలెత్తినట్లు తెలిసింది. ఈ గొడవలో ఓ వ్యక్తి గాజు సీసాతో దాడి చేయటంతో మరో వ్యక్తి తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే అతన్ని అశ్వినీ అస్పత్రికి తరలించారు. అయితే తమ పిల్లాడిని బలవంతంగా లాగేశారని.. అందుకే గొడవ జరిగినట్లు దాడి చేసిన వ్యక్తి చెప్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.