Tirumala SSD Token Timings: లాంగ్ వీకెండ్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దర్శనానికి 24 గంటల సమయం పట్టడంతో, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు ఉదయాన్నే టికెట్లు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో భక్తుల ఇబ్బందులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గతంలో మధ్యాహ్నం ఇచ్చే టికెట్లను ఇప్పుడు ఉదయం నుంచే పంపిణీ చేస్తున్నారు. ఇకపై కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు.