తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు.. వాహనసేవలు చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మాఢవీధుల్లో జరిగే వాహన సేవలను భక్తులు మరింత దగ్గరగా చూసేలా సరికొత్త ఏర్పాట్లకు శ్రీకారం చుడుతోంది. ఇక గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులు ఆకలి, దప్పికలతో ఉండకుండా వారికి అన్నపానీయాలు అందిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.