తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తోంది. మార్చి రెండో తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకూ ఈ వేలం ప్రక్రియ జరగనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ వేలంలో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. మరోవైపు టీటీడీలో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్ తొలగింపు కోసం కూడా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు టీటీడీ ఏఈవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.