AP DGP Review on Tirumala Security: నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చే తిరుమల పుణ్యక్షేత్రం భద్రతను మరింత బలోపేతం చేసే విషయంపై టీటీడీ దృష్టి సారించింది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, టీటీడీ ఈవో శ్యామలరావు నేతృత్వంలో శుక్రవారం తిరుమల భద్రత బలోపేతంపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు. మరోవైపు తిరుమల ఆలయ పరిసరాల్లో డ్రోన్ల సంచారాన్ని అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ టెక్నాలజీని తేవాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు వేగంగా అడుగులు పడుతున్నాయి.