Tirumala Devotees Valuables Safe: తిరుమల యాత్రికులకు పోలీసుల హెచ్చరిక! భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న కిషోర్రెడ్డి అనే ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులతో లాకర్లు తీసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. భక్తులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, వాహనాల్లో వదిలి వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. టీటీడీ లాకర్లలో భద్రంగా ఉంచుకోవాలని కోరుతున్నారు. అప్రమత్తంగా ఉంటేనే శ్రీవారి దర్శనం ప్రశాంతంగా జరుగుతుంది అంటున్నారు.