TTD Announces New Canteens: తిరుమల యాత్రికులకు టీటీడీ శుభవార్త. శ్రీవారి దర్శనం కోసం భక్తుల కోసం బిగ్, జనతా క్యాంటీన్లను మరింత పారదర్శకంగా కేటాయించారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించేందుకు ప్రముఖ సంస్థలకు అవకాశం కల్పించారు. కొత్త విధానాలతో, నిపుణుల పర్యవేక్షణలో ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి. పేరెన్నికగల హోటల్స్ ఉండటంతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నూతన మార్పులు తిరుమల యాత్రను మరింత ఆహ్లాదకరంగా మార్చనున్నాయి.