శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్లే భక్తులకు అలర్ట్.. చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ ఏడో తేదీన శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఏడో తేదీ సాయంత్రం నుంచి ఎనిమిదో తేదీ ఉదయం వరకూ ఆలయం మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏడో తేదీ శ్రీవారి బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ప్రకటించింది. అలాగే ఏడో తేదీన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శన వేళల్లోనూ మార్పులు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.