తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. జూలై 25 నుంచి ఆగస్టు 15 వరకు 16 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆదివారం తిరుపతి నుంచి చర్లపల్లికి, సోమవారం చర్లపల్లి నుంచి తిరుపతికి రైళ్లు నడుస్తాయి. వీటితో పాటు ఎర్నాకుళం-పాట్నా మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఆ వివరాలు..