Tirumala Darshan Visesha Homam t Tickets Online August 1st: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక! శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఆగస్టు 1 నుంచి ఆన్లైన్లోనే విడుదల చేయనున్నారు. వాల్మీకిపురంలో శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జూలై 29 నుంచి 31 వరకు వైభవంగా జరగనున్నాయి. స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, పనులను నాణ్యంగా పూర్తి చేయాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు.