Tirumala Temple To Closed Due To Lunar Eclipse On March 3: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. తిరుమల శ్రీవారి ఆలయం మార్చి 3న 10.30 గంటల పాటు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కావడంతో.. ఆ రోజు పలు ఆర్జిత సేవలు, దర్శనాలు రద్దు చేయబడ్డాయి. భక్తులు తమ యాత్ర ప్రణాళికను మార్చుకోవాలని టీటీడీ సూచించింది. మరోవైపు, టీటీడీ జేఈవో డా. ఏశరత్ ఎస్వీ బాలమందిరాన్ని సందర్శించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.