Tirumala Temple Inside Mandapams: తిరుమల శ్రీవారి ఆలయంలోని చారిత్రక మండపాల గురించి తెలుసుకుందాం.. కృష్ణరాయ మండపం, రంగనాయకుల మండపం వంటి నిర్మాణాలు భక్తులకు ఆకర్షణగా నిలుస్తాయి. వీటిని చక్రవర్తులు, రాజులు నిర్మించారు. రంగనాయకుల మండపంలో ఉత్సవాలు జరుగుతాయి. కళ్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆనంద నిలయంలో విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. తిరుమల పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని విశ్వాసం.