Tirumala Darshan Less Time: వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి దర్శనానికి వేచి ఉండే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చడంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం 6 నుంచి 10 గంటల్లోనే పూర్తవుతోంది. బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేయడం వల్ల రోజుకు ఏడువేల మందికి పైగా సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మంగళవారం నాలుగు గంటల్లో, బుధవారం మూడు గంటల్లోనే దర్శనం లభించిందని టీటీడీ తెలిపింది.