Tirumala Devotee Rs 10 Lakhs Donation: తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, ముప్పరాజు జగదీష్, కడూరు విజయలక్ష్మి దంపతులు బర్డ్ ట్రస్టుకు రూ.10,01,116 విరాళం అందించారు. అదే విధంగా, తిరుమల ఆలయంలో ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద జీయర్ స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక సాయంత్రం స్వామి అమ్మవారు పుష్ప పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చారు.