శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలో మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దయ్యాయి. ఏప్రిల్ పది నుంచి మూడు రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో తెలిపింది.