చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మూసివేయనున్నారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయాన్ని కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి మూసివేసి, రేపు ఉదయం 7.30 గంటలకు తెరుస్తారు. భక్తులు ఈ మార్పులను గమనించి ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.