Tirumala Darshan In Two Hours: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. జనవరి 8 వరకు పది రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రద్దీని అంచనా వేస్తూ, భక్తులకు మెరుగైన సమాచారం అందిస్తారు. సామాన్య భక్తులకే ఎక్కువ సమయం కేటాయించి, వృద్ధులు, పిల్లలకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించనున్నారు. అన్నప్రసాదాలు, వసతి, భద్రతకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.