Tirumala Devotees Free Bus Service: తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈవో శ్యామలరావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు. ఉద్యోగులకు వీఆర్ఎస్ అవకాశం కల్పించడంతో పాటు, అత్యాధునిక స్కానర్లతో తనిఖీలు, నాణ్యమైన అన్నప్రసాదం పంపిణీకి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల ఛార్జీల దోపిడీని అరికట్టడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు.