TTD Plans Mudupu Patram For Devotees In Tirumala: తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ వినూత్నమైన ఆలోచన చేసింది. భక్తులు నాణేలు, హుండీలో డబ్బులు వేయడానికి ఇబ్బందులు లేకుండా వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ముడుపు పత్రాల పేరుతో భక్తుల చేతిలో డబ్బులు లేకపోయినా హుండీలో కానుకలు వేసేలా ప్లాన్ చేస్తోంది. ఇవాళ తిరుమలలో జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించి ముడుపు పత్రాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.