తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం మారనుంది. ఇప్పటి వరకూ టీటీడీ ఏఈవో కార్యాలయంలో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ఉండేది. అయితే దీనిని అన్నమయ్య భవన్ ఎదురుగా ఏర్పాటుచేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని పరిశీలించిన టీటీడీ ఏవో శ్యామలరావు జూలై 22న ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే భక్తుల కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.