Tirumala Revamping Alipiri Check Point: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజాను ఆధునీకరించనున్నట్లు టీటీడీ ఈవో జె. శ్యామల రావు తెలిపారు. శ్రీవారి భక్తుల లగేజీ స్కానింగ్ సమయాన్ని తగ్గించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని జీఎంఆర్ రాక్సా సంస్థకు సూచించారు. తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.