Tirumala Laddu Counters Inspection: తిరుమలలో శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తనిఖీలు నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లను పరిశీలించి, లడ్డూల నాణ్యత, రుచి, క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించడంపై భక్తుల సంతృప్తిని తెలిపారు. లడ్డూల ఉత్పత్తిని పెంచి, కౌంటర్ల వద్ద త్వరితగతిన లడ్డూలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, దర్శనాలకు సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.