తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. లడ్డూ ప్రసాదం కొనుగోలు మరింత సులభతరం చేస్తూ, ప్రత్యేక కియోస్క్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ చెల్లింపుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చు. దర్శనం టికెట్ ఉన్నవారు, లేనివారు కూడా ఈ యంత్రం ద్వారా లడ్డూలు పొందవచ్చు. అంతేకాకుండా, టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పలువురు భక్తులు విరాళాలు అందజేశారు.