Tirumala Fake Seva Tickets Man Arrest: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఇప్పిస్తానని భక్తులను మోసం చేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన కె.హరి నాగసాయి కార్తీక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ ఇటువంటి మోసాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చిన కార్తీక్, శ్రీప్రభాకర చార్యులు అనే పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఖాతా సృష్టించి భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. పోలీసులు అతడి నుంచి రూ.1,03,340 స్వాధీనం చేసుకున్నారు.