తిరుమల శ్రీవారి సేవలో పీకే దంపతులు

1 year ago 33
తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దర్శించుకున్నారు. వేకువజామున సుప్రభాత సేవలో ప్రశాంత్ కిశోర్ సతీ సమేంగాగా పాల్గొని.. స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ప్రశాంత్‌ కిశోర్‌ దంపతులకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుని... జన సూరజ్ పేరుతో తన సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ పార్టీని ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడులో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన నటుడు విజయ్‌తో ఆయన మంగళవారం భేటీ అయ్యారు. చెన్నై నుంచి ఆయన తిరుమలకు వచ్చారు.
Read Entire Article