టీటీడీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని.. ఆ తర్వాత టీటీడీకి భారీగా విరాళాలు ఇస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు భక్తులు తాజాగా రూ.20.50 లక్షల విరాళాలను టీటీడీకి అందించారు. ఇందులో విజయవాడకు చెందిన జ్యువెలరీ షాప్ యజమాని రూ.10.50 లక్షలు అందించగా.. తాడేపల్లి గూడెం వాసి టీటీడీ పథకానికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.