Chandrababu Rs 44 Lakhs Donation To TTD: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20వ తేదీన తిరుమలకు వస్తున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్తో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. ఈ నెల 20వ తేదీన సాయంత్రం తిరుమలకు వెళతారు.. రాత్రి అక్కడే పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే 21వ తేదీన తెల్లవారు జామున చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.