తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించారు. టీటీడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్కు విరాళం ఇచ్చారు. ఏకంగా రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. విజయనగరం జిల్లాకు చెందిన కృష్ణ హరీష్ ఈశ్వర అనే భక్తుడు.. విరాళానికి సంబంధించిన డీడీని.. టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఇచ్చారు. ఆ సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు.