Tirumala Hyderabad Devotees Donations To TTD Trusts: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు విరాళాలు కూడా అందిస్తుంటారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ముగ్గురు భక్తులు టీటీడీకి విరాళాలు అందించారు. మొత్తం రూ.37.55లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా దాతల్ని టీటీడీ అభినందించింది. ఇటు ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. అలాగే తిరుమలలోని నాదనీరజనం వేదికపై గురువారం సాయంత్రం స్వర సంగమం కార్యక్రమం కూడా నిర్వహించింది టీటీడీ.