Reliance Industries ED Pms Prasad Donation To TTD: తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా ఇచ్చారు. దాత విరాళానికి సంబంధించిన డీడీని ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ ఈ ఏడాది జనవరి నెలలో కూడా టీటీడీకి భారీగా విరాళం అందించారు.