తిరుమల కొండపై ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఒక్క దర్శనం మాత్రమే కాకుండా లాకర్లు, 3 పూటలా భోజనం, స్నానాలు వంటి అన్ని సౌకర్యాలు తిరుమలలో ఉంటాయి. అదే సమయంలో తిరుమల శ్రీవారికి భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించే భక్తులకు.. ప్రతీ సంవత్సరం స్పెషల్ దర్శనాలతోపాటు.. అనేక రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. శ్రీవారికి రూ.కోటి విరాళం ఇస్తే.. భక్తులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సౌకర్యాలు అందుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.