Tirumala Devotee Rs 10 Lakhs Donation: తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడు భారీ విరాళం అందజేశారు. పెద్ద మనసుతో భక్తుల కోసం విరాళం అందించారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా ఇచ్చారు. మరోవైపు తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఊంజల్ సేవ నిర్వహించారు. పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల వెనుక ఒక పురాతన కథ ఉందని చెబుతున్నారు.