Tirumala Paradala Mani: తిరుపతికి చెందిన పరదాల మణి 27 ఏళ్లుగా శ్రీవారికి పరదాలు సమర్పిస్తూ తన భక్తిని చాటుకుంటున్నారు. ఏటా నాలుగుసార్లు ప్రత్యేక రోజుల్లో పరదాలు ఇవ్వడం ఆయన ఆనవాయితీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మణి కాలినడకన తిరుమలకు చేరుకుని దేవస్థానం అధికారులకు పరదాలు అందజేశారు. ఆయన తయారుచేసిన పరదాలు గర్భాలయం, రాములవారి మేడలో అలంకరిస్తారు. టైలర్గా జీవితం ప్రారంభించిన మణి, శ్రీనివాసుడి పిలుపుతో ఈ సేవకు అంకితమయ్యారు.