ఎల్పీజీ గ్యాస్ కొరత ప్రభావం తిరుమలను సైతం తాకింది. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా తిరుమలలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలను మూసివేస్తున్న పరిస్థితి. గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో కార్యకలాపాలు సాగించలేక.. నిర్వాహకులు వీటిని మూసివేస్తున్నారు. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీ గోడౌన్ల వద్ద హోటల్స్ నిర్వాహకులు క్యూ కడుతున్నారు. మరోవైపు గ్యాస్ సరఫరాలో ఆటంకం లేకుండా టీటీడీ ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.