TTD Devotees Feedback On Chandrababu Meeting: తిరుమల తిరుపతి దేవస్థానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరితోపాటు ఉన్నతాధికారులతో అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు, సౌకర్యాల్లో మార్పు కోసం సీఎం కొన్ని సూచనలు చేశారు. భక్తుల రద్దీ, దర్శనాల సౌకర్యాలు, అన్నప్రసాద సేవలపై మెరుగుదల ఉందని..పలు చర్యలు చేపట్టాలని సూచించారు.