తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. సెప్టెంబర్ 16వ తేదీన తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సెప్టెంబర్ 16న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు గమనించుకోవాలని సూచించింది.