తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వంటకాలు చేయాలని.. కొండపై ఉండే హోటల్ యజమానులకు టీటీడీ సూచించింది. దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు.. ఆయా రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలు అందించాలని హితవు పలికింది. హోటల్లలో పరిశుభ్రత పాటించాలని.. ఎలాంటి లోపాలు ఉండకూడదని తెలిపింది. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని భక్తిశ్రద్ధలతో అందించాలని పేర్కొంది. ఈ సందర్భంగా తిరుమలలోని హోటల్ యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.