Beggars Illegal Traders Evicted From Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ, పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. యాచకులు, అనధికార వ్యాపారులను గుర్తించి 82 మందిని తిరుమల నుండి తరలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు.