Tirumala New Rest House Inaugurated: తిరుమలలో భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. కొండపై వసతి కోసం మరో అతిథిగృహం అందుబాటులోకి వచ్చింది. ‘సింహ నిలయం’ గెస్ట్హౌస్ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. సెల్కాన్ గ్రూప్ అతిథిగృహాన్ని నిర్మించింది. తిరుమల వచ్చే భక్తులకు కొత్తగా నిర్మించిన గెస్ట్హౌస్లోని గదులను కేటాయించనున్నారు. తిరుమలలో దాదాపు 200 గదులు అందుబాటులోకి వస్తాయని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.