వేసవి సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది, ముఖ్యంగా వారాంతాల్లో రద్దీ మరింత అధికంగా ఉంటోంది. ఆదివారం నాడు శిలాతోరణం వరకు క్యూలైన్ ఉండటంతో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం రికార్డు స్థాయిలో 90,087 మంది భక్తులు దర్శించుకున్నారు, మరియు హుండీ ద్వారా 4.3 కోట్ల ఆదాయం వచ్చింది.