తిరుమలలో భక్తుల వసతి సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ కీలక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా కొత్తగా యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేడు భవనాన్ని పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దీనికి అనుమతులు లభించాయని, త్వరలో సీఎం చంద్రబాబు దీనిని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ సముదాయం ద్వారా అదనంగా మరో 2,500 మంది భక్తులకు వసతి లభిస్తుందని ఆయన తెలిపారు. ఆ వివరాలు..