Tirumala Anna Prasadam Kendram Timings: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తోంది. 1985లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఎందరో దాతలు విరాళాలు అందిస్తున్నారు. దాతలు రూ.44 లక్షలు విరాళం ఇస్తే, ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కోసం విడివిడిగా కూడా విరాళాలు ఇవ్వవచ్చు. రోజుకు దాదాపు 2.5 లక్షల మంది భక్తులు ఈ అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.