Tirumala Devotees Alipiri Base Camp: తిరుమలలో భక్తుల గదులకు సంబంధించి టీటీడీక కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, అడిషనల్ ఈవోలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొండపై పెరుగుతున్న భక్తుల రద్దీని గమనించి దృష్ట్యా శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మేరకు స్థలాన్ని కూడా గుర్తించారు.