TTD Land Allocation Updates: తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కట్టుబడి ఉంది. రాజకీయ జోక్యం తగ్గించి, పవిత్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ల రెండెకరాల భూమి కేటాయింపు విన్నపాన్ని టీటీడీ తిరస్కరించింది. కొండపై కొత్త నిర్మాణాలపై నిషేధం, భూమి కొరత, హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బదులుగా, ఇప్పటికే ఉన్న అతిథిగృహాల్లో భవనాలను కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.