తిరుమలలో మరో మోసం వెలుగుచూసింది. టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీనని చెప్పి ఇద్దరు దళారులు భక్తురాలిని మోసగించారు. తమిళనాడు చెందిన ఓ యువతి విజయవాడ సిద్ధార్థ కళాశాలలో పీజీ చదువుతోంది. అయితే శ్రీవారి దర్శనం కోసం వీరిని ఆశ్రయించగా.. 5 వీఐపీ బ్రేక్ దర్శనం, 5 సుప్రభాత సేవా టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి యువతి నుంచి 2.60 లక్షలు ఫోన్పే చేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోగా.. మోసపోయానని గ్రహించిన యువతి తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.