పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో వైసీపీ కుట్రలు మళ్లీ మొదలయ్యాయని మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల దర్శనానికి వెళ్లే కంపార్ట్మెంట్లో ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేసిన ఘటనపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఆ నిరసన తెలిపిన వ్యక్తి వైసీపీ నేత అని తేల్చి చెప్పారు. ఒక పథకం ప్రకారమే.. కావాలనే ఆ వ్యక్తితో వైసీపీ ఇలాంటి పని చేయించిందని మండిపడ్డారు. తిరుమలపై తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలకు దిగుతామని నారా లోకేష్ తీవ్ర హెచ్చరికలు చేశారు.