Tirumala Constructions Andhra Pradesh High Court Comments: తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మారనీయొద్దని వ్యాఖ్యానించింది హైకోర్టు. కొండపై భవన నిర్మాణాల విషయంలో మరింత అలర్ట్గా ఉండాలని సూచించింది. ధార్మిక సంస్థల పేరుతో ఎలాపడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని.. అక్రమ నిర్మాణాలను అనుమతిస్తుంటే కొన్నాళ్లకు అటవీప్రాంతం కనుమరుగవుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం నోటీసులు జారీచేసింది.