Tirumala Police Naka Bandi: తిరుమలలో భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొండపై ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఉక్కుపాదం మోపేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టింది తిరుపతి జిల్లా పోలీసుశాఖ. తిరుమలలోని బాలాజీనగర్లో పోలీసులు విస్తృతస్థాయి నాకాబందీ నిర్వహించారు. స్థానికుల గుర్తింపుకార్డుల్ని పరిశీలించి.. కొండపై పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే ఉండాలి. కొత్తగా ఎవరు ఉండటానికి వీల్లేదంటున్నారు పోలీసులు.