వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. పలువురు వీఐపీలు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారు. రాజకీయ రంగం మొదలుకుని సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే వైసీపీ నేతలకు నిబంధనలకు విరుద్ధంగా దర్శనాలు కల్పించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.